యాప్నగరం

రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం

ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది నిమిత్తం వారం క్రితం హైదరాబాద్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే.

TNN 30 Dec 2016, 5:25 pm
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది నిమిత్తం వారం క్రితం హైదరాబాద్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయన సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ తో పాటూ తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అందరికి రాష్ట్రపతి అభివాదాలు తెలియజేశారు. అతిధులు కూడా భారీగా హాజరయ్యారు. అందరికీ విందు ఏర్పాటు చేశారు.
Samayam Telugu at home programme at rashtrapati nilay in hyderabad
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.