యాప్నగరం

కృష్ణా నదిలో పడవ బోల్తా: 21 మంది మృతి

విజయవాడ సమీపంలోని కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.

TNN 22 Dec 2017, 5:24 pm
విజయవాడ సమీపంలోని కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఆదివారం (నవంబర్ 12న) సాయంత్రం పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. బోటులో మొత్తం 38 మంది ఉండగా వారిలో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 23 మంది గల్లంతవగా ఆదివారం రాత్రి వరకు 16 మృతదేహాలను వెలికి తీశారు. ఆ తరవాత మరింత లోతుగా గాలించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం 21 ​మృత దేహాలను వెలికితీశారు.
Samayam Telugu at least 17 die as boat with 38 capsizes in andhra pradesh
కృష్ణా నదిలో పడవ బోల్తా: 21 మంది మృతి


ప్రమాదం జరిగిందిలా..
కార్తీక మాసం కావడంతో పిక్నిక్‌కి అని ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన 60 మంది బృందం రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో అమరావతికి ఆదివారం ఉదయం వచ్చారు. ఇక్కడ పలు ప్రదేశాలను సందర్శించిన తర్వాత సాయంత్రానికి విజయవాడలోని పున్నమిఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలో పవిత్రసంగమం వద్ద నిత్యహారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు. అప్పటికే సాయంత్రం 4.30 కావడంతో ఏపీ పర్యాటకశాఖకు చెందిన పడవ రాదని సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న ప్రైవేటు సంస్థ రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌కు చెందిన పడవను మాట్లాడుకున్నారు. ఈ పడవకు కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతే లేదు.

20 మందిని కూడా ఎక్కించడానికి వీలులేని బోటులో ఏకంగా 38 మందిని ఎక్కించారు. పున్నమిఘాట్‌ నుంచి బయలుదేరిన బోటు సాయంత్రం 5.20 గంటల సమయానికి పవిత్ర సంగమం సమీపానికి చేరుకుంది. అక్కడ గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే ప్రాంతంలో ఇసుక మేటలు ఉన్నాయి. పడవ ఒక వైపునకు కొంచెం ఒరగగానే.. పర్యాటకులు అంతా భయంతో ఒకేవైపునకు వచ్చారు. కంగారుపడిన డ్రైవర్‌ పడవను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అది బోల్తా పడింది. దీన్ని గమనించిన కొంత మంది జాలర్లు పర్యాటకులను కాపాడే ప్రయత్నం చేశారు. కొంత మందిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే మంగళగిరి నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.