యాప్నగరం

ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభం

అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరును ప్రజలందరూ నిశితంగా గమనిస్తారు. వారి బాధ్యతలు, హక్కుల గురించి పూర్తిస్థాయి అవగాహన కలిగించడానికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 3 Jul 2019, 12:00 pm
ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్‌ పరిశీలన, వాటిని అర్థం చేసుకోవడంపై సదస్సులో వివరిస్తారు. ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీలో కమిటీ హాలు-1లో ఈ సదస్సు మొలైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ చక్షూ రాయ్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తదితరులు ప్రసంగించనున్నారు.
Samayam Telugu speaker


Read Also: బాబు ప్రారంభించిన వెబ్‌సైట్ పేరు మార్చిన జగన్

ప్రస్తుత అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన సభ్యులు 100మందికి పైగా ఉన్నారని, వారందరికీ సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని స్పీకర్ తమ్మినేని అన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదికన్న ఆయన, శాసనసభ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.శాసనసభ పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం కలిగేలా చేస్తామని పేర్కొన్నారు. నేటితరం ఎమ్మెల్యేలు అనే అంశంపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉపన్యసిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.