యాప్నగరం

ఫేస్‌బుక్ ప్రేమ.. అమ్మాయి ప్రాణం తీసింది

ఫేస్‌బుక్‌ పరిచయం ద్వారా ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడన్న బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది.

TNN 9 May 2017, 1:30 pm
ఫేస్‌బుక్‌ పరిచయం ద్వారా ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడన్న బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. తనొక పెద్ద బిల్డర్నని చెప్పి ప్రేమించిన వ్యక్తి.. ఓ సాధారణ పెయింటర్ అని తెలియడంతో కుమిలిపోయిన ఆ అమ్మాయి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. కన్న తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో చోటుచేసుకుంది.
Samayam Telugu b pharmacy student commits suicide in visakhapatnam allegedly cheated by her lover
ఫేస్‌బుక్ ప్రేమ.. అమ్మాయి ప్రాణం తీసింది


పోలీసులు వివరాల ప్రకారం.. తగరపువలసకు చెందిన ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ కుమార్తె ప్రవల్లిక(21) రఘు ఇంజనీరింగ్‌ కాలేజీలో బిఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. గోపాలపట్నం శివారు ఎస్సీబీసీ కాలనీకి చెందిన నక్కా రాజేష్‌(25)తో ఫేస్‌బుక్‌ ద్వారా ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో రాజేష్‌ తనను బిల్డర్‌గా నమోదు చేసుకుని ప్రవల్లికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. రెండు నెలల క్రితం ఎస్సీబీసీ కాలనీకి వచ్చిన ప్రవల్లిక.. రాజేష్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. తనను మోసం చేశావంటూ రాజేష్‌ను నిలదీసింది.

దీంతో రాజేష్ బంధువులు ప్రవల్లికకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేశారు. అయితే రాజేష్‌‌కి పెళ్లి కుదిరిందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రవల్లిక.. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ఎస్సీబీసీ కాలనీకి వచ్చింది. తనతోపాటు కిరోసిన్‌ కూడా తెచ్చుకుంది. కాలనీలోనే శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం తెలుసుకున్న రాజేష్‌ ఘటనాస్థలానికి చేరుకుని ప్రవల్లికను ప్రవల్లికను స్థానికుల సాయంతో కేజీహెచ్‌కు తరలించాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతిచెందింది. కేసు నమోదుచేసిన గోపాలపట్నం పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.