యాప్నగరం

ముందస్తు ఎన్నికలపై బాబు, లోకేష్ కామెంట్స్!

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల పట్ల ఉత్సాహం చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 27 Jun 2018, 9:46 am
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల పట్ల ఉత్సాహం చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు.. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇలా ఎన్నికలకు వెళ్లబోతున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు కూడా ఉంటాయని అంటున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. వీటికి ముందస్తు ఉంటుందనే ఊహాగానాలున్నాయి.
Samayam Telugu babuloke


ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి. అక్టోబర్లోనే ఎన్నికలు అనే ఊహాగానాలకు విరుద్ధంగా స్పందించారు వీరిద్దరూ. ముందస్తు ఎన్నికల ఊసే ఉండదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. అందుకే వచ్చే ఏడాది ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకూ ఎన్నికలు వచ్చే అవకాశం లేదని లోకేష్ అన్నారు.

ఇక పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... అక్టోబర్లో అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే సమస్యే లేదన్నట్టుగా స్పందించినట్టుగా సమాచారం. అంతగా ముందస్తు ఎన్నికలు అన్నా, జనవరి తర్వాతే అని చంద్రబాబు స్పష్టం చేశారట. ఈ ఏడాదిలో మాత్రం ఎన్నికలు ఉండవన్నట్టుగా పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

స్థూలంగా ముందస్తు ఎన్నికల పట్ల తెలుగుదేశం పార్టీ పెద్ద ఆసక్తితో లేదని ఈ మాటలను బట్టి స్పష్టం అవుతోంది. సాధారణ ఎన్నికలకు వెళ్లడానికే ఈ పార్టీ ముఖ్యనేతలు మొగ్గు చూపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.