యాప్నగరం

ఫైనల్ రౌండ్: నంద్యాలకు చంద్రబాబు

పోరు ముగింపు దశకు వచ్చింది..

TNN 18 Aug 2017, 7:59 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల పర్యటనకు వెళ్లనున్నారు. ఉప ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల్లోనే మకాం పెట్టారు. నంద్యాల ప్రచారానికి నేటితో సహా మరో నాలుగు రోజుల గడువు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పాటు నంద్యాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి బాబు నంద్యాల్లో ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
Samayam Telugu babu to campaign in nandyal
ఫైనల్ రౌండ్: నంద్యాలకు చంద్రబాబు


చంద్రబాబు శనివారం ఉదయం నంద్యాలకు చేరుకుంటారని, వివిధ బహిరంగ సభల్లో, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొంటారని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తెలిపారు. రోడ్ షో కూడా ఉంటుందని వారు ప్రకటించారు. శనివారం రాత్రి బాబు నంద్యాల్లోనే బస చేస్తారని, ఆదివారం రోజున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ఆదివారం మధ్యాహ్నంతో చంద్రబాబు నంద్యాల పర్యటన ముగుస్తుందని తెలిపారు. సోమవారంతో నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది.

ప్రస్తుతం నంద్యాల్లో ప్రచార హోరు కొనసాగుతోంది. ఇంకా చేరికలు, కండువాలు మార్చుకోవడాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఈయన నంద్యాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.