యాప్నగరం

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం మిర్చి రైతులు చేసిన ఆందోళన, విధ్వంసం వెనుక రాజకీయ కుట్రదాగి

Samayam Telugu 29 Apr 2017, 6:53 pm
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం మిర్చి రైతులు చేసిన ఆందోళన, విధ్వంసం వెనుక రాజకీయ కుట్రదాగి ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మార్కెట్ యార్డులో జరింగింది కేవలం కృత్రిమ ఆందోళన అని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని కేసీఆర్ బీఏసీ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది.
Samayam Telugu bac meeting on ts assembly session over land acquisition bill
మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే


భూసేకరణ బిల్లుకు సవరణలు చేపట్టేందుకు ఆదివారం అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో శనివారం సభా వ్యవహారాల సమావేశం జరిగింది. టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రేపు జరగబోయే సమావేశంలో మిర్చి రైతుల సమస్యలు కూడా చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశం కేవలం భూసేకరణ బిల్లులో కేంద్రం సూచించిన మేరకు సవరణలు చేపట్టేందుకేనని.. ఇతర అంశాలు చర్చకు రావని సీఎం స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.