రాజమండ్రి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ. 5లక్షలకిపైగా నగదు వున్న బ్యాగుని వెంటతీసుకుని రాజమండ్రి నుంచి హైదరాబాద్కి బయల్దేరారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగిపోయే సమయంలో బ్యాగు కోసం వెతికిన ఆమెకి ఆ బ్యాగు కనిపించలేదు. తన బ్యాగు చోరీకి గురైందని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు స్థానిక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన తన బ్యాగులో రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, మరో రూ. 5 లక్షల వరకు నగదు వున్నాయని బాధితురాలు వాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం వుంటున్న వాణి స్వస్థలం రాజమండ్రి. రాజమండ్రిలో జరిగిన తన బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగే సమయంలో తన ఆభరణాలు, నగదు మొత్తం చోరీకి గురైనట్టు గుర్తించారామె. బాధితురాలు వాణి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మంత్రి బంధువని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం వుంటున్న వాణి స్వస్థలం రాజమండ్రి. రాజమండ్రిలో జరిగిన తన బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగే సమయంలో తన ఆభరణాలు, నగదు మొత్తం చోరీకి గురైనట్టు గుర్తించారామె. బాధితురాలు వాణి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మంత్రి బంధువని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.