యాప్నగరం

మంత్రి గారి బంధువు బ్యాగులో రూ. కోటి నగలు చోరీ

రాజమండ్రి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ చోరీ జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు...

TNN 12 Oct 2017, 6:29 pm
రాజమండ్రి గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ చోరీ జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ. 5లక్షలకిపైగా నగదు వున్న బ్యాగుని వెంటతీసుకుని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌‌కి బయల్దేరారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు దిగిపోయే సమయంలో బ్యాగు కోసం వెతికిన ఆమెకి ఆ బ్యాగు కనిపించలేదు. తన బ్యాగు చోరీకి గురైందని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు స్థానిక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన తన బ్యాగులో రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, మరో రూ. 5 లక్షల వరకు నగదు వున్నాయని బాధితురాలు వాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu bag worth rs 1 crore gold jewellery of a woman passenger robbed in train
మంత్రి గారి బంధువు బ్యాగులో రూ. కోటి నగలు చోరీ


హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం వుంటున్న వాణి స్వస్థలం రాజమండ్రి. రాజమండ్రిలో జరిగిన తన బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన ఆమె బుధవారం సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగే సమయంలో తన ఆభరణాలు, నగదు మొత్తం చోరీకి గురైనట్టు గుర్తించారామె. బాధితురాలు వాణి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మంత్రి బంధువని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.