యాప్నగరం

Nandamuri Balakrishna: ఓహో.. బాలయ్య వల్లే తారక్ ప్రచారానికి రాలేదా?

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి కారణం బాలయ్యేనట.

Samayam Telugu 8 Dec 2018, 1:27 pm
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు ప్రకటించగానే.. ఆమె తరఫున కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. అక్కకు సపోర్ట్‌గా తారక్ ట్వీట్ చేయడంతో.. కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు భావించారు. కానీ ఈ విషయంలో కొద్ది రోజులు ఎటూ తేల్చని తారక్.. చివరికి ప్రచారం చేయబోవడం లేదని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్.. తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నందమూరి హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్‌కు తిరిగి బాలయ్య, చంద్రబాబు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ కుమార్తెకి బాబు కూకట్‌పల్లి టికెట్ ఇచ్చారు.
Samayam Telugu balaiah tarak


నందమూరి సుహాసిని తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం నందమూరి ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. అనేక రూమర్లకు కూడా ఇది ఆస్కారం కల్పించింది. మరి ఇంతకూ టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి కారణం బాలయ్యేనట.

ఎన్టీఆర్‌‌‌‌కు ప్రచారాలు కలిసి రాలేదనే కారణంతో బాలకృష్ణే ఆయన్ను వారించారట. అంతే కాకుండా ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తే.. కొందరికి నచ్చకపోవచ్చు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉండటంతో ప్రచారం చేయొద్దని చెప్పారట. ‘తారక్ నా అన్న కొడుకే కాదు.. నాకు కూడా కొడుకే. అందుకే ప్రచారానికి రానివ్వలేదు. మోక్షజ్ఞ ఎందుకు ప్రచారానికి రాలేదో.. ఎన్టీఆర్ కూడా అందుకే రాలేద’ని బాలయ్య వివరణ ఇచ్చాడట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.