తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండగ కానుకగా వారి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచే ప్రారంభం అవనుంది. స్థానిక ప్రభుత్వ అధికారుల సహాయంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. అందుకోసం మొత్తం రూ.222 కోట్ల విలువైన సుమారు కోటీ నాలుగు లక్షల చీరలను ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేసింది. వీటిలో తెలంగాణ నేతన్నలు నేసినవి 52 లక్షల చీరలు కాగా మిగితావి సూరత్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించారు.
తెలంగాణలో రూపొందిన చీరల్లో సిరిసిల్ల నేతన్నల పాత్ర కీలకంగా వున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఈ బతుకమ్మ చీరల నేయడం వల్ల సిరిసిల్ల నేత కార్మికులు సుమారు రూ.70 కోట్ల మేరకు ఉపాధి పొందారు. కానీ తగినంత సమయం లేకపోవడం వల్లే మిగతా చీరలని సూరత్ నుంచి తెప్పించడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ చీరలన్నీ ఇక్కడే నేసే ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం కేసీఆర్ వున్నారు అని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు స్పష్టంచేశారు.
బతుకమ్మ చీరల కోసం ఇప్పటి వరకు ఏడున్నర కోట్ల మీటర్ల వస్త్రాలని వినియోగించారు. మహిళల అభిరుచులకి అనుగుణంగా వారికి నచ్చేలా 500 రకాల డిజైన్లలో చీరలు సిద్ధం చేశారు. డిజైన్లు, చీరల ఎంపికలో సీఎంవో మహిళా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్స్టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ నేతృత్వంలో చీరలను సేకరించారు. 18 ఏళ్ల వయస్సు నిండి తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతీ సోదరికి బతుకమ్మ చీరను అందించనున్నట్టు ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం కావడంతో జిల్లాల కలెక్టర్లు సైతం ఈ చీరల పంపిణీ కార్యక్రమం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
తెలంగాణలో రూపొందిన చీరల్లో సిరిసిల్ల నేతన్నల పాత్ర కీలకంగా వున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఈ బతుకమ్మ చీరల నేయడం వల్ల సిరిసిల్ల నేత కార్మికులు సుమారు రూ.70 కోట్ల మేరకు ఉపాధి పొందారు. కానీ తగినంత సమయం లేకపోవడం వల్లే మిగతా చీరలని సూరత్ నుంచి తెప్పించడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ చీరలన్నీ ఇక్కడే నేసే ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం కేసీఆర్ వున్నారు అని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు స్పష్టంచేశారు.
బతుకమ్మ చీరల కోసం ఇప్పటి వరకు ఏడున్నర కోట్ల మీటర్ల వస్త్రాలని వినియోగించారు. మహిళల అభిరుచులకి అనుగుణంగా వారికి నచ్చేలా 500 రకాల డిజైన్లలో చీరలు సిద్ధం చేశారు. డిజైన్లు, చీరల ఎంపికలో సీఎంవో మహిళా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్స్టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ నేతృత్వంలో చీరలను సేకరించారు. 18 ఏళ్ల వయస్సు నిండి తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతీ సోదరికి బతుకమ్మ చీరను అందించనున్నట్టు ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం కావడంతో జిల్లాల కలెక్టర్లు సైతం ఈ చీరల పంపిణీ కార్యక్రమం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.