యాప్నగరం

నిర్లక్ష్యం చేస్తే వచ్చే కేబినెట్‌లో ఉండను : తుమ్మల నాగేశ్వరరావు

పదవులు కోరుకున్న నాయకులు పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Samayam Telugu 21 Sep 2018, 2:09 pm
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పలు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు.
Samayam Telugu Thummala Nageswara Rao


సీఎంగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల వల్లే సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాముఖ్యత ఉందని తుమ్మల వ్యాఖ్యానించారు పార్టీ కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్ష్యం చేయవద్దని, అలా కాని పక్షంలో వచ్చే రాష్ట్ర కేబినేట్‌లో తనకు అవకాశం ఉండన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని, కార్యకర్తలు అన్ని విధాల సిద్ధం కావాలని సూచించారు.

పదవులు కోరుకున్న నాయకులు పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుందన్నారు. తాను అవసరం కోసమో, అవకాశాల కోసమో తారుమారు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజల అభీష్టం మేరకే తాను పార్టీ మారవలసివచ్చిందని తుమ్మల పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.