యాప్నగరం

తిరుమలలో మహిళపై ఎలుగు దాడి.. ఇంట్లో చెప్పకుండా వచ్చిన హైదరాబాద్ మహిళ

మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. గోగర్భం వద్ద అటవీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన మహిళపై ఎలుగు దాడి చేసింది.

Samayam Telugu 15 Jul 2019, 10:30 pm
తిరుమలలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తిరుమలలోని గోగర్భం వద్ద ఉన్న మటాల వెనుక అటవీ ప్రాంతంలోకి వెళ్లగా.. ఎలుగు ఒక్కసారిగా దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఎలుగు దాడిలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానిక అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ హైదరాబాద్‌కు చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం కారణంగా ఆమె ఇంట్లో చెప్పకుండా తిరుమల వచ్చినట్లు సమాచారం.
Samayam Telugu vijaya
మహిళపై ఎలుగు దాడి


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను జేఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తుండగా ఎలుగుబంటి దాడి చేసినట్లు మహిళ చెప్పినట్లుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.