యాప్నగరం

లంచం అడిగిన వాళ్లని చెప్పుతో కొట్టండి: సీఎం కేసీఆర్

ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించిన నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఈరోజు...

TNN 8 Oct 2017, 8:22 pm
ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించిన నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఈరోజు హైదరాబాద్‌లో‌ని ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిశారు. సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వారిని ఉ్దదేశించి మాట్లాడిన సీఎం కేసీఆర్.. కార్మికులు ఇంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే సింగరేణి యాత్ర పేరిట తానే స్వయంగా వచ్చి కార్మికులని కలుస్తానని.. వారి సమస్యలను అక్కడే అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Samayam Telugu beat them with chappal if someone demands bribe cm kcr
లంచం అడిగిన వాళ్లని చెప్పుతో కొట్టండి: సీఎం కేసీఆర్


ఇన్నాళ్లు కార్మిక సంఘాలని అడ్డం పెట్టుకుని సంఘాల నాయకులే లాభపడ్డారన్న సీఎం కేసీఆర్... ఇకపై కార్మికులు కూడా లభ్ధి పొందుతారని అన్నారు. కార్మికులు సింగరేణి ఫలాలని అందుకునే క్రమంలో వారిని ఎవరైనా లంచం అడిగితే ఊరుకునే ప్రసక్తేలేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. కార్మికులు తమని లంచం అడిగిన వారిని ఉపేక్షించకుండా పై స్థాయి వారికి ఫిర్యాదు చేయండని.. ఇంకా అవసరమైతే వారిని చెప్పుతో కొట్టాలని కార్మికులకి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.