యాప్నగరం

ఇద్దరూ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారట!

ఆర్జే స్టూడియోలో పనిచేసే బ్యూటీషియన్ శిరీష, కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరిదీ ఆత్మహత్యేనని పోలీసులు తేల్చేశారు.

TNN 7 Jul 2017, 12:56 pm
ఆర్జే స్టూడియోలో పనిచేసే బ్యూటీషియన్ శిరీష, కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరిదీ ఆత్మహత్యేనని పోలీసులు తేల్చేశారు. ఇద్దరూ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముందు నుంచి ఇవి ఆత్మహత్యలేనని చెబుతున్నామని, సాంకేతిక, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీటిని ఆత్మహత్యలుగా నిర్ధారించామని వారు తెలిపారు. తమ వాదనకు ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదిక కూడా బలం చేకూర్చిందని అన్నారు. ఆత్మహత్యకు ముందు శిరీష ఆల్కహాల్ సేవించిందని తెలిపారు. లోదుస్తులపై మరకల గురించి మాట్లాడడం సభ్యత కాదని వైద్య నివేదికను ఆమె కుటుంబ సభ్యులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇంకా తమపై ఆరోపణలు చేయడం సరికాదని, అలా కాకుండా వారి దగ్గర ఎవైనా ఆధారాలు ఉంటే అందజేయాలని సూచించారు.
Samayam Telugu beautician sirisha si prabhakar reddy suicide mistery
ఇద్దరూ భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారట!


అంతకు ముందు అత్యంత కీలకమైన ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె ధరించిన ప్యాంటీపై కొన్ని మరకలు ఉన్నాయని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నప్పటి నుంచీ ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానాలు బలపడగా, అటువంటిదేమీ లేదని ఈ నివేదిక తేల్చింది. శిరీష లోదుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధరించారు. వీర్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదని పేర్కొన్నారు. కాగా, ఈ రిపోర్టుతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని, తనపై అత్యాచారయత్నం జరగడంతో, నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసు వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.