యాప్నగరం

నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి: చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా తనకు ఎక్కువ సమయం దొరికిందని బాబు అన్నారు. వైఎస్ కు సోనియాగాంధీ హైకమాండ్ గా ఉండేవారని బాబు ఆరోపించారు.

Samayam Telugu 20 Mar 2017, 2:49 pm
హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కేవలం తాను, టీడీపీ ప్రభుత్వాలే కారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.
Samayam Telugu because of me only hyderabad developed chandrababu naidu
నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చరిత్ర తిరగరాస్తామని బాబు అసెంబ్లీలో సభ్యుల చప్పట్ల మధ్య వెల్లడించారు.

హైదరాబాద్ లో ఐటీ ఊతమిచ్చి, హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టింది తమ హయంలోనేనని బాబు గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం, రహదారుల అభివృద్ధి వంటి చర్యలతో హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిపామని అన్నారు.

2050 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దుతామని బాబు మరోసారి స్పష్టం చేశారు. తనకు ప్రజలే హైకమాండ్ వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే తన కర్తవ్యమని బాబు అన్నారు.

ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయని...అయినా ఎక్కడా భయపడకుండా ముందుకు కదులుతున్నామని బాబు పేర్కొన్నారు.

ఏపీ భవిష్యత్ కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానని చెప్పిన బాబు... వ్యవసాయం, టెక్నాలజీ, విద్యా, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేస్తామని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా తనకు ఎక్కువ సమయం దొరికిందని బాబు అన్నారు. వైఎస్ కు సోనియాగాంధీ హైకమాండ్ గా ఉండేవారని బాబు ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.