యాప్నగరం

Bharat Bandh in TS: తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక ప్రభావం

రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కొనసాగుతోంది.

Samayam Telugu 10 Sep 2018, 10:57 am
పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా విపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌ తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలపడంతో.. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కారు. బస్సు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, కోర్టులు యథావిధిగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు డిపోల ముందు ఆందోళన నిర్వహించారు. ఉప్పల్, ముషీరాబాద్‌లతోపాటు పలు డిపోల ముందు బైటాయించి.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి.
Samayam Telugu bandh


విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్‌ సందర్భంగా విజయవాడలో చాలా వరకు స్కూళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. గుంటూరులో జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు వద్ద బస్సలను అడ్డుకున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది.
శ్రీకాకుళంలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. తెల్లవారు జామునుంచే బస్సులు రోడ్లపై కనిపించాయి. బస్సులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలోనూ బంద్‌ పాక్షికంగా ఉంది. రోడ్లపై బస్సుల రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.