తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించేంత వరకు పోరాటం ఆపబోమని ఆయన తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి బాలయ్య నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశల వ్యాపింపజేసిన ఎన్టీఆర్ కు భారత రత్న దక్కేంత వరకు పోరాడతానని, పార్టీ కూడా ఈ మేరకు కేంద్రంతో కృషి చేస్తుందని బాలయ్య అన్నారు.
తన తాజా చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయవంతంగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశల వ్యాపింపజేసిన ఎన్టీఆర్ కు భారత రత్న దక్కేంత వరకు పోరాడతానని, పార్టీ కూడా ఈ మేరకు కేంద్రంతో కృషి చేస్తుందని బాలయ్య అన్నారు.
తన తాజా చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయవంతంగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.