యాప్నగరం

నాన్నకు భారతరత్న కోసం పోరాడతా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించేంత వరకు పోరాటం ఆపబోమని

Samayam Telugu 18 Jan 2017, 10:47 am
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించేంత వరకు పోరాటం ఆపబోమని ఆయన తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి బాలయ్య నివాళులు అర్పించారు.
Samayam Telugu bharat ratna to ntr demand tdp mla balakrishna
నాన్నకు భారతరత్న కోసం పోరాడతా


ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశల వ్యాపింపజేసిన ఎన్టీఆర్ కు భారత రత్న దక్కేంత వరకు పోరాడతానని, పార్టీ కూడా ఈ మేరకు కేంద్రంతో కృషి చేస్తుందని బాలయ్య అన్నారు.

తన తాజా చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయవంతంగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.