నిజామాబాద్ జిల్లా నవీపేటలో దళితులపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ నేత భరత్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 11) పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దళిత యువకులపై తాను దాడి చేసిన మాట అవాస్తవం అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో దృశ్యాలన్నీ ఒక షార్ట్ ఫిల్మ్లో భాగంగా తీసినవేనని చెప్పుకొచ్చాడు.
‘షార్ట్ ఫిల్మ్ అయితే, దళితులను బూతులతో ఎందుకు తిట్టారు?' అనే మీడియా ప్రశ్నించగా.. ‘మా చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికీ దొరల రాజ్యమే ఉంది. ఆ గ్రామాల వాతావరణం యావత్తు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఎలాంటి సెన్సార్ లేకుండా చిత్రీకరించా' అని భరత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఇంటకీ ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘దొరల రాజ్యం' అని భరత్ రెడ్డి సమాధానమిచ్చాడు. బెదిరించడం వల్లే అలా చెప్పామని నిజామాబాద్ వెళ్లిన తర్వాత బాధితులు చెప్పారుగా.. అని మీడియా ఆరా తీయగా.. ‘హైదరాబాద్లో మీడియా ముందు వారు మాట్లాడిన విషయం మీడియా ద్వారానే నాకు తెలిసింది. పోలీసు అధికారులకు ఓ వీడియో స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలుసు' అన్నాడు.
మీ చెరలో ఉన్న దళిత యువకులను ఓ చోట విడిచిపెట్టి, మీరు పోలీసుల ఎదుట లొంగిపోయారటగా అని ప్రశ్నించగా.. అది వాస్తవం కాదంటూ భరత్ రెడ్డి కొట్టిపడేశాడు. తాను మొరం వ్యాపారం చేసే వ్యక్తిని కాదని, తనకు ఎలాంటి దందాలు, లేవని, తనపై రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారని భరత్ రెడ్డి చెప్పాడు. వారిపై న్యాయపోరాటం కూడా చేస్తానని అతడు చెప్పడం కొసమెరుపు.
‘షార్ట్ ఫిల్మ్ అయితే, దళితులను బూతులతో ఎందుకు తిట్టారు?' అనే మీడియా ప్రశ్నించగా.. ‘మా చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికీ దొరల రాజ్యమే ఉంది. ఆ గ్రామాల వాతావరణం యావత్తు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఎలాంటి సెన్సార్ లేకుండా చిత్రీకరించా' అని భరత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఇంటకీ ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘దొరల రాజ్యం' అని భరత్ రెడ్డి సమాధానమిచ్చాడు. బెదిరించడం వల్లే అలా చెప్పామని నిజామాబాద్ వెళ్లిన తర్వాత బాధితులు చెప్పారుగా.. అని మీడియా ఆరా తీయగా.. ‘హైదరాబాద్లో మీడియా ముందు వారు మాట్లాడిన విషయం మీడియా ద్వారానే నాకు తెలిసింది. పోలీసు అధికారులకు ఓ వీడియో స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలుసు' అన్నాడు.
మీ చెరలో ఉన్న దళిత యువకులను ఓ చోట విడిచిపెట్టి, మీరు పోలీసుల ఎదుట లొంగిపోయారటగా అని ప్రశ్నించగా.. అది వాస్తవం కాదంటూ భరత్ రెడ్డి కొట్టిపడేశాడు. తాను మొరం వ్యాపారం చేసే వ్యక్తిని కాదని, తనకు ఎలాంటి దందాలు, లేవని, తనపై రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారని భరత్ రెడ్డి చెప్పాడు. వారిపై న్యాయపోరాటం కూడా చేస్తానని అతడు చెప్పడం కొసమెరుపు.