యాప్నగరం

నంద్యాల టిక్కెట్... పార్టీదే తుది నిర్ణయం

నంద్యాల ఉపఎన్నిక టిక్కెట్ పై అఖిల ప్రియ మాటమార్చారు.

TNN 24 Apr 2017, 12:36 pm
తెదేపా నేత భూమా నాగిరెడ్డి మరణించడంతో నంద్యాల నియోజక వర్గానికి ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో టిక్కెట్ తమకే కావాలంటూ భూమా వర్గం, కాదు మాకే కావాలంటూ శిల్పా వర్గం పట్టుబడుతున్నాయి. ఈసారి టిక్కెట్ తమకు ఇవ్వకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని ఇప్పటికే శిల్పా వర్గం హెచ్చరించింది. దీంతో చంద్రబాబు ఇరుకున పడినట్టు అయ్యింది. ఆ ఉపఎన్నికల అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్ఠానం నోరుమెదపడం లేదు. కాగా కొత్తగా మంత్రి అయిన భూమా అఖిల ప్రియ నాలుగురోజుల కిందటి వరకు ఆ ఉపఎన్నికలో తమ కుటుంబానికి చెందిన వ్యక్తి పోటీలో ఉంటారని చెప్పుకుంటూ వచ్చారు. ఏం జరిగినా తమ వర్గానికే టిక్కెటని కుండబద్దలు కొట్టారు. అయితే ఏమైందో ఏమో... ఆమె ఇప్పుడు మాట మార్చారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబును రెండు మూడు రోజుల్లో కలవనున్నట్టు తెలిపారు.
Samayam Telugu bhuma akhila priya on nandyal by election candidate
నంద్యాల టిక్కెట్... పార్టీదే తుది నిర్ణయం


నిజానికి తన కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో... అఖిల ప్రియ ప్రకటించడానికి కూడా సిద్ధమైనట్టు సమాచారం. తన తల్లి శోభా నాగిరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా సోమవారం అభ్యర్థి పేరును ప్రకటించాలని అనుకున్నారు. అయితే అధిష్థానం ఆదేశంతో ఆమె ఆగిపోయినట్టు తెలుస్తోంది. మరో పక్క శిల్పా మోహన్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో పలుమార్లు చర్చించారు. ఇప్పుడు నంద్యాల ఉపఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధిష్టానం భూమా, శిల్పా వర్గాల్లో టిక్కెట్ ఎవరికి ఇవ్వనుందో సర్వత్రా ఉత్కంఠగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.