యాప్నగరం

నంద్యాలలో ఓడితే నాదే బాధ్యత: భూమా అఖిల ప్రియ

నంద్యాలలో గెలిస్తే అది అందరి విజయంగా భావిస్తాం. కానీ ఒకవేళ ఓడితే మాత్రం అందుకు తానే బాధ్యత వహిస్తానని అన్నారు...

TNN 5 Aug 2017, 3:31 pm
నంద్యాలలో గెలిస్తే అది అందరి విజయంగా భావిస్తాం. కానీ ఒకవేళ ఓడితే మాత్రం అందుకు తానే బాధ్యత వహిస్తానని అన్నారు ఏపీ మంత్రి అఖిల ప్రియ. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి శనివారం ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నంద్యాల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తోందని ప్రతిపక్షం చేస్తోన్న ఆరోపణలని అఖిలప్రియ కొట్టిపారేశారు. భూమా నాగిరెడ్డి బతికున్నప్పుడే నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. అవసరమైతే ఆ లేఖలు మీడియాకు విడుదల చేస్తానని స్పష్టంచేశారామె.
Samayam Telugu bhuma akhilapriya criticises jagan comments about cm chandrababu naidu
నంద్యాలలో ఓడితే నాదే బాధ్యత: భూమా అఖిల ప్రియ


నంద్యాల బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అఖిలప్రియ.. 'బహిరంగ సభలో జగన్ అలా మాట్లాడతారని అనుకోలేదు' అని అన్నారు. బహిరంగ వేదికలపై నుంచి ఎవరిపైన ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. కానీ జగన్ పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. జగన్ వ్యాఖ్యల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది అని తెలిపారు అఖిలప్రియ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.