యాప్నగరం

కలెక్టర్ కూతురికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం

ఓ జిల్లా కలెక్టర్... ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు.

TNN 18 Mar 2017, 7:57 am
ఓ జిల్లా కలెక్టర్... ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. తాను ప్రవేశపెట్టిన కార్యక్రమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తన కూతురికి ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించి ప్రజలందరికీ గొప్పతనాన్ని చాటుకున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి. ఆయన కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పోత్సహించేందుకు ‘కాన్పునకు రా తల్లీ’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఆయన కూతురు ప్రగతి గర్భం దాల్చింది. 15 రోజుల క్రితం ఆయన తన కూతురిని ప్రసవానికి పుట్టింటికి పిలిచారు. తాను ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రగతిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడే గవర్నమెంట్ డాక్టర్లు ప్రసవం చేశారు. కలెక్టర్ కు మనవరాలు పుట్టింది. పండంటి మనవరాలిని ఎత్తుకుని కలెక్టర్ దంపతులు మురిసిపోయారు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న ప్రగతికి సిజేరియన్ చేశారు వైద్యులు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Samayam Telugu bhupalpalli collectors daughter delivers at govt hospital
కలెక్టర్ కూతురికి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం


కలెక్టర్‌ మురళి మాట్లాడుతూ... ధనిక, పేద,మధ్య తరగతి అనే తేడా లేకుండా అందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పులు చేయించాలని ఆయన కోరారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.