యాప్నగరం

నీటిరంగ నిపుణుడికి కన్నీటి వీడ్కోలు

అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు అంత్యక్రియలు

Samayam Telugu 30 Apr 2017, 11:47 am
అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు అంత్యక్రియలు ఆదివారం అంబర్ పేట స్మశానవాటికలో పూర్తయ్యాయి. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. విద్యాసాగర్ రావు అంతిమయాత్రలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనియాదవ్ లతో పాటు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్లీలు ఉన్నారు.
Samayam Telugu bid adieu to telangana irrigation expert r vidyasagar rao
నీటిరంగ నిపుణుడికి కన్నీటి వీడ్కోలు


ప్రజాగాయకుడు గద్దర్, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, విరసం నేత వరవరరావు తదతరులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యాసాగర్ రావు తెలంగాణ ఏర్పాటులో చేసిన కృషిని కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.