యాప్నగరం

జనం మాట వినకపోతే జగన్‌లా అవుతారట!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పదోతరగతి పేపర్ లీక్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది.

TNN 30 Mar 2017, 2:34 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పదోతరగతి పేపర్ లీక్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. నెల్లూరు జిల్లాలోని పదోతరగతి పేపర్ లీక్ పై గంటా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అసలు పదోతగరతి పేపర్ లీక్ కాలేదని అన్నారు. నారాయణ కళాశాలలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీశాడని తెలిపారు. ఆ విషయంపై ప్రభుత్వమే పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. అనంతరం ఆయన వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఓ మెసేజ్ ను ఆయన అసెంబ్లీలో చెప్పారు. తల్లి మాట వినకపోతే రాహుల్ లా తయారవుతారని, తండ్రి మాట వినకపోతే అఖిలేష్ లా తయారవుతారని, జనం మాట వినకపోతే జగన్మోహనరెడ్డిలా తయారవుతారని వాట్సాప్ లో సందేశాలు వస్తున్నాయని చెప్పారు.
Samayam Telugu big fight in ap assembly over tenth paper leak
జనం మాట వినకపోతే జగన్‌లా అవుతారట!


ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతే ఈ నెల 26న పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయ్యిందని, పరీక్ష జరగడానికి అయిదు నిమిషాల ముందే ప్రశ్నాపత్రం బయటికి వచ్చిందని చెప్పారు. దీనిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు పేపర్ లీక్ అయినట్టు కూడా ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదని అన్నారు. జగన్ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చాలా ఘాటుగా స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.