యాప్నగరం

ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం.. ఆపరేషన్ కమలం షురూ?

ఏపీ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరి చందన్‌ను నియామకం. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి కార్యాలయం. బిశ్వభూషణ్‌ ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత.

Samayam Telugu 16 Jul 2019, 6:36 pm
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ వచ్చేశారు. బిశ్వభూషణ్‌ హరి చందన్‌ను కొత్త గవర్నర్‌గా నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వ భూషణ్ ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత. మరోవైపు హరిచందన్‌తో పాటూ చత్తీస్‌గడ్‌కు గవర్నర్‌ను నియమించారు. ఆ రాష్ట్రానికి అనసూయ ఊకిని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu governor


హరిచందన్ ఒడిశా బీజేపీ సీనియర్ నేత. 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరిన ఆయన.. 1988లో బీజేపీ గూటికి వెళ్లారు. తర్వాత భువనేశ్వర్ నుంచి ఎంపీగా గెలిచి.. 1980నుంచి 1988 వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. సిలికా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా పనిచేశారు. హరిచందన్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.. రచయితగా పలు పుస్తకాలను రచించారు.

హరి చందన్ నియామకంతో.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతారు. నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటి నుంచి గవర్నర్‌గా ఉంటున్నారు. విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు గవర్నర్‌ను మారుస్తారని ప్రచారం జరిగినా.. మార్చలేదు. ఇప్పుడు బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.