యాప్నగరం

అమిత్ షా తెలంగాణ టూర్.. అమ్మ దర్శనంతో ఎన్నికల శంఖారావం.. జోరు పెంచనున్న బీజేపీ

బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. లాల్ దర్వాజా మహాంకాళి అమ్మవారిని దర్శించుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Samayam Telugu 15 Sep 2018, 9:13 am
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాట్లలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 12 గంటలకు బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.
Samayam Telugu amith shah


అనంతరం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో లాల్ దర్వాజ గుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు. మజ్లిస్ పార్టీకి కంచుకోట లాంటి పాత బస్తీలో ఉన్న లాల్ దర్వాజ గుడికి అమిత్ షా వెళ్తుండటం పొలిటికల్ హీట్ పెంచనుంది.

మధ్యాహ్నం 3 గంగలకు మహబూబ్‌నగర్ బహిరంగ సభ ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ సమీపంలో ఉన్న కొత్తూరులో పార్టీ నేతలతో ఆయన భేటీ అవుతారు. ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహం గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రాయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.