యాప్నగరం

మంత్రి కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారు

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో

Samayam Telugu 5 Apr 2017, 8:56 pm
లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో విద్వేషప్రకటనలతో ప్రజలను రెచ్చగొట్టడటం నేరమని ఆ పార్టీ నేత నల్లు ఇంద్ర సేనా రెడ్డి విమర్శించారు. కేటీఆర్ మంత్రిగానే గాక...ముఖ్యమంత్రి తనయుడని గుర్తు చేసిన నల్లు... బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఈ రకంగా వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో చట్టాలను అతిక్రమించారని తెలిపారు.
Samayam Telugu bjp condemns minister ktrs comments
మంత్రి కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారు


మంత్రి మాటలను నమ్మి ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో, తమ పనులు జాప్యం కావడాన్ని తట్టుకోలేక గతంలో కొందరు ఆవేశంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేశారని ఇంద్రసేనా గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వం అవినీతిపై మాట్లాడితే అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోందని చెప్పిన నల్లు..తమ ప్రభుత్వం నీతివంతమైందని డబ్బా కొట్టుకోవడానికే కేటీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.