యాప్నగరం

జగన్ పాదయాత్రపై బీజేపీ నేత ప్రశంసలు!

ప్రజాసంకల్పయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు బీజేపీ శాసనసభా పక్ష నేత

TNN 11 Jan 2018, 10:49 am
ప్రజాసంకల్పయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు. దృఢమైన సంకల్పం చేతనే జగన్ సుదీర్ఘమైన పాదయాత్రను చేయగలుగుతున్నారు.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఏదో ఒకటీ రెండు రోజుల పాటు పాదయాత్రను చేయడం వేరు.. రోజులు, వారాలు, నెలల తరబడి పాదయాత్రను కొనసాగించడం వేరు అని.. అంటూ పాదయాత్రను చేస్తున్న జగన్ ను అభినందించారు రాజు.
Samayam Telugu bjp leader praises ys jagan
జగన్ పాదయాత్రపై బీజేపీ నేత ప్రశంసలు!


తను కూడా పాదయాత్రను చేయాలని అనుకుంటున్నాను..అని అయితే.. అది అంత సులభం కాదనే విషయం అర్థమైందన్నారు. జగన్ గురించి తెలిసిందే అని .. పట్టుదల ఎక్కువ అనే విషయం తెలసిందే అని, ఆ మొండితనంతోనే జగన్ పాదయాత్రను సాగిస్తున్నారని ఈ బీజేపీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. పాదయాత్ర మే నెలలో విశాఖ పట్నం వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు తాము కూడా కలుస్తామని.. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ పాదయాత్రను సాగిస్తున్న జగన్ ను కలిసి అభినందిస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు.

జగన్ ను కలవాలని తన మామ తనను పలు సార్లు అడిగారని.. పాదయాత్ర సందర్భంగా ఆయనను జగన్ వద్దకు తీసుకెళ్తామని ఈ బీజేపీ నేత చెప్పడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.