యాప్నగరం

​ఆ మాట చంద్రబాబుతో చెప్పించండి చూద్దాం..!

ఈ విషయం పై టీడీపీ స్పష్టతను ఇవ్వాలన్నారు.

TNN 22 May 2017, 2:49 pm
భారతీయ జనతా పార్టీ తో పొత్తు వల్లనే గత ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ తగ్గిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు స్పందించారు. తెలుగుదేశం పార్టీకి తమపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని అంటూ సోమూ ధ్వజమెత్తారు. బీజేపీతో పొత్తు వల్లనే మెజారిటీ తగ్గిందనే మాటను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోనే చెప్పించాలని సోమూ డిమాండ్ చేశారు. కేశినేని వ్యాఖ్య ఆయన సొంత అభిప్రాయమా లేక తెలుగుదేశం అధినేత అభిప్రాయమా? అని బీజేపీ నేత ప్రశ్నించారు. ఈ విషయం పై టీడీపీ స్పష్టతను ఇవ్వాలన్నారు.
Samayam Telugu bjp leaders counter attack on tdp
​ఆ మాట చంద్రబాబుతో చెప్పించండి చూద్దాం..!


మరోవైపు ఇంకో బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ కూడా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన వివరాలు తెలిపిన కన్నా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉండబోతున్నాయని అన్నారు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు, రాజకీయ పార్టీ.. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాం.. అని కన్నా అన్నారు. ‘ఏపీలో త్వరలోనే కొంతమంది పీఠాలు కదలబోతున్నాయి..’ అని కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించడమే అమితాసక్తిని రేపుతున్నాయి.

అలాగే పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జి నారాయణ రెడ్డి హత్యపై స్పందించారు. తాము ఈ హత్యారాజకీయాలను సమర్థించమని వారు అన్నారు. మొత్తానికి టీడీపీ, బీజేపీ నేతల పరోక్ష మాటల యుద్ధం ఆసక్తిదాయకంగానే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.