యాప్నగరం

నెక్లెస్ రోడ్డులో ఘనంగా ‘తిరంగా యాత్ర’

అంతర్గత శక్తులే దేశ సమగ్రతను భంగం చేయాలని చూస్తున్నాయి.. ప్రతి పౌరుడూ దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా..

TNN 12 Aug 2017, 5:33 pm
హైదరాబాద్‌లో శనివారం (ఆగస్టు 12) నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన ‘తిరంగా యాత్ర’లో బీజేపీ నేతలు చురుగ్గా పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనా తీరును దత్తాత్రేయ ప్రసంశించారు.
Samayam Telugu bjp leaders participate in tiranga yatra at hyderabad
నెక్లెస్ రోడ్డులో ఘనంగా ‘తిరంగా యాత్ర’


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మత రాజకీయాల కోసమే తూతూ మంత్రంగా నిర్వహిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. కొన్ని అంతర్గత శక్తులే దేశ సమగ్రతను భంగం చేయాలని చూస్తున్నాయని, ప్రతి పౌరుడూ అవసరమైనప్పుడు దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కిషణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.