యాప్నగరం

దేవుడిపై ఒట్టు పైసా లంచం తీసుకోలే.. : మాజీ మంత్రి కామినేని

ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

TNN 9 Mar 2018, 8:28 pm
ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. చంద్రబాబు కేబినెట్ మంత్రిగా పనిచేసిన నేను ఇన్నేళ్లలో ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా పనిచేశానని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయంలో ప్రమాణం చేశారు. 2014 ఎన్నికల్లో కైకలూరు నుండి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందన కామినేని శ్రీనివాస్.. టీడీపీతో పొత్తులో భాగంగా మంత్రిపదవి పొందారాయన. కాగా ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అధిష్టానం ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Samayam Telugu bjp minister kamineni srinivas rao sensational comments on corruption
దేవుడిపై ఒట్టు పైసా లంచం తీసుకోలే.. : మాజీ మంత్రి కామినేని


తాజాగా కాణిపాకం సిద్ది వినాయకుడిని దర్శించుకున్న ఆయన మంత్రిగా ప్రజలకు నీతి వంతమైన పాలన అందించానని, ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేవుడిపై ప్రమాణం చేస్తూ.. ఇలా చేయడం వల్ల తన అత్మస్థైర్యం మరింత పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆలోచనలు జరుపుతుందని.. ప్రజలకు మేలు చేసేందుకే మోడీ ప్రభుత్వం ఉందన్నారు. అయితే తాత్కాలికంగా కేంద్ర కేబినెట్ నుండి టీడీపీ మంత్రులు బయటకు వచ్చినా.. టీడీపీ ఇప్పటికీ ఎన్డీఏలో భాగంగానే ఉందన్నారు కామినేని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.