యాప్నగరం

పవన్‌కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే భార్య దీక్ష

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం జనసేన అధినేత పవన్ చేపట్టిన దీక్షకు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య మద్దతు పలికారు. పద్మాలక్ష్మి కూడా అనుచరులతో కలిసి రాజమండ్రిలో నిరసన దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

Samayam Telugu 26 May 2018, 8:06 pm
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం జనసేన అధినేత పవన్ చేపట్టిన దీక్షకు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య మద్దతు పలికారు. పద్మాలక్ష్మి కూడా అనుచరులతో కలిసి రాజమండ్రిలో నిరసన దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నిరసన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినా.. తాను మాత్రం పవన్ అభిమాననని అంటున్నారు లక్ష్మీ. అందుకే ఆయనకు మద్దుతగా దీక్షకు కూర్చున్నానని చెప్పారు. ఈ విషయం తన భర్తకు కూడా తెలుసని.. ఆయన పార్టీ ఆయనదే.. తన నిర్ణయం తనదేనని చెప్పారు.
Samayam Telugu Bjp Mla Wife


గత ఎన్నికల్లో కూడా పవన్ తరఫున బీజేపీకి మద్దతు తెలపామని.. అలాగే ప్రచారం కూడా చేశామని చెప్పారు లక్ష్మీ. తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. పవన్ విధానాలు నచ్చే మద్దతు తెలుపుతున్నానన్నారు. తనకు పవన్ నుంచి గుర్తింపు అవసరం లేదని.. ఎలాంటి పదవుల్ని కూడా ఆశించడం లేదని చెప్పడం కొసమెరుపు. ఆకుల సత్యనారాయణ భార్య దీక్ష ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భర్త ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యే.. భార్య మరో పార్టీకి మద్దతు తెలపడం నిజంగానే విచిత్రంగా ఉందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.