యాప్నగరం

రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్!

హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయబోతున్నారు.

TNN 21 Mar 2017, 7:54 am
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయబోతున్నారు. మంగళవారం తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు స్వయంగా అందజేస్తానని చెప్పారు. ధూల్ పేట ప్రాంతంలోని బస్తీవాసుల కష్టాలు తీర్చనందుకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇంతకాలం గుడుంబా అమ్మకాలపైనే ఆధారపడి జీవించిన ఆ ప్రజలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా సోమవారమే ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ధూల్ పేట బస్తీవాసుల కష్టాలు తీరుస్తామని హామీకావాలని కోరారు. లేకుంటే మంగళవారం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
Samayam Telugu bjp mla raja singh threatens to resign if dhoolpet issues remain unsolved
రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్!


పేదలకు ఉపాధి కల్పించకుండా... అక్కడ గుడంబా అమ్మకాలను అరికట్టారని, దీంతో చాలా మంది ఏం చేయాలో తెలియక, బతుకు భారంగా ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ధూల్ పేట ప్రాంతంలో పర్యటించి అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధూల్ పేటలో మూడువేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని లేఖలో పేర్కొనారు. వారంతా నిజాం కాలం నుంచి గుడుంబా అమ్ముకునే జీవిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే అయిన తన అభిప్రాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ధూల్ పేట ప్రజల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే... తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.