యాప్నగరం

టీడీపీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపాయి.

TNN 24 Jan 2018, 9:42 pm
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణం అంటూ వారు వెంటనే రాజీనామా చేయాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుందన్నారు.
Samayam Telugu bjp mla vishnu kumar raju sensational comments on ycp ministers in tdp
టీడీపీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్


ఇలా చేయలేని పరిస్థితిలో ఏ పార్టీ గుర్తుపై గెలిచినా మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. కాగా విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి టీడీపీలో చేరారని.. అవి స్పీకర్ పరిధిలో ఉన్నాయన్నారు. స్పీకర్ వారి రాజీనామాలను అమోదిస్తే.. ఉపఎన్నికలకు వెళ్లడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నాయని అయితే పార్టీలో ఏ నిర్ణయమైన తమ అధినేత చూసుకుంటారని.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలను విలువలేదన్నారు.

కాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధం అని ప్రకటించడం.. తాజాగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేయడం టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.