యాప్నగరం

వైఎస్ జగన్‌ను కలుస్తా: బీజేపీ ఎమ్మెల్యే

త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నట్టుగా ప్రకటించారు బీజేపీ

Samayam Telugu 24 Apr 2018, 5:28 pm
త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నట్టుగా ప్రకటించారు బీజేపీ ఏపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలవబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇది వరకూ ఒకసారి ఈ విషయాన్ని చెప్పిన విష్ణుకుమార్ రాజు మరోసారి ఇదే మాటే చెప్పడం ఆసక్తిదాయకంగా మారింది.
Samayam Telugu jagan_ptp


గతంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను అభినందించారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ ధైర్యసాహసాలు అభినందనీయం అని ఈ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఐదారు కిలోమీటర్ల దూరం నడవాలంటేనే చాలా మంది హడలిపోతారని, రెండు మూడు రోజులు అలా నడిస్తే మంచం పడతారని, అయితే జగన్ మాత్రం అలుపెరగకుండా వేల కిలోమీటర్ల దూరం నడుస్తుండటం గొప్ప అని విష్ణుకుమార్ రాజు అభినందించారు. జగన్‌కు తమ ఇంట్లో కూడా అభిమానులున్నారని, తన మామ జగన్ ను ఇష్టపడతారని.. జగన్ ను కలవాలని తనను అడిగారని రాజు వివరించారు.

ఆయనను తీసుకుని జగన్ వద్దకు వెళ్తామని, జగన్ పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు తాము కలుస్తామని రాజు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి అదే విషయం చెప్పారు ఈ బీజేపీ నేత. పాదయాత్రలో భాగంగా జగన్ విశాఖకు వచ్చినప్పుడు తన మామను జగన్ వద్దకు తీసుకెళ్తాను అని ఆయన అన్నారు. ఇంతకు మించిన ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడంం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.