యాప్నగరం

‘పవన్, బీజేపీ లేకపోతే బాబు ప్రతిపక్షంలో కూర్చుండేవారు’

ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేయడంతో బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 19 Mar 2018, 8:14 am
ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేయడంతో బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. తమతో పొత్తుపెట్టుకోవడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, పవన్ కల్యాణ్ మద్దతు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో టీడీపీ పొత్తు పెట్టుకోకపోయి, పవన్ ప్రచారం చేయకుంటే వైసీపీ అధినేత జగన్ సీఎం అయ్యేవారని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉండేదని దుయ్యబట్టారు.
Samayam Telugu bjp mla vishnukumar raju comments against tdp
‘పవన్, బీజేపీ లేకపోతే బాబు ప్రతిపక్షంలో కూర్చుండేవారు’


టీడీపీ తమకు మిత్రపక్షం కాబట్టే ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, ఇకపై అలా ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి రావడానికి కారణం తానేనని, తనవల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని తెలిపారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిపోయిందని, ఇకపై రాష్ట్రంలో తాము ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్‌పై తప్పకుండా వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడమేంటని అన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు మాటమార్చడం వెనుక ఆంతర్యం ఏంటని విష్ణుకుమార్ రాజు నిలదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.