యాప్నగరం

టీడీపీ వల్ల చిత్రహింసలు అనుభవించాం: సోము

టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీతో పొత్తు వల్ల చిత్రహింసలు అనుభవించామని... అది ఇంకా కొనసాగి ఉంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యేవన్నారు.

Samayam Telugu 31 Mar 2018, 3:10 pm
టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీతో పొత్తు వల్ల చిత్రహింసలు అనుభవించామని... అది ఇంకా కొనసాగి ఉంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యేవన్నారు. అందుకు దేవుడికి కృతజ్ఞ‌తలు తెలుపుతున్నామన్నారు. రాయలసీమపై చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారని.... కేంద్రం నిధులు ఇచ్చినా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి... ఇప్పుడు తిరిగి కేంద్రంపై అపవాదులు వేస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu Somu


పోలవరాన్ని రాష్ట్ర నిధులతో పూర్తి చేస్తామని చెబుతున్న టీడీపీ నేతలు... పెండింగ్ ప్రాజెక్టుల్ని కూడా ఆ నిధులతోనే పూర్తి చేయాలన్నారు సోము. కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని... సీఎం, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కను సన్నల్లో పాలన నడుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆప్కో ఛైర్మన్ గుజ్జల శ్రీనివాసులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని... వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.