యాప్నగరం

ఇటు సింపతీ డ్రామాలు.. అటు రాహుల్‌తో డ్యూయెట్లా: జీవీఎల్

బాబ్లీ కేసులో వారెంట్ పేరుతో టీడీపీ కొత్త డ్రామాలాడుతోంది. ఇదంతా సింపతీ కోసమేనంటున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Samayam Telugu 14 Sep 2018, 11:54 pm
బాబ్లీ కేసు పేరుతో దొంగ సింపతీ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందంటున్నారు బీజేపీ ఎంపీ నరసింహారావు. ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్.. టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు సంధించారు. చంద్రబాబుపై బీజేపీ కక్షసాధించాల్సిన అవసరం లేదని.. బాబ్లీ కేసులో 22 నోటీసులు వచ్చినా స్పందించకపోవడంతోనే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్నారు. ఈ కేసు పేరుతో డ్రామా రాజకీయాలకే పరిమితమైన టీడీపీ.. పోరాటమంటూ ఆరాటపడుతోందన్నారు. విచారణకు హాజరైతే చంద్రబాబును ఏ1, ఏ2 అని పిలుస్తారని భయమా అని ప్రశ్నించారు.
Samayam Telugu Gvl Narasimha rao


కేసులు తనపై రాకుండా చంద్రబాబు తంత్రాలు చేస్తుంటారని.. ఓటుకి నోటు కేసులో బహిరంగంగా పట్టుబడిన బాబు.. దాని నుంచి బయటపడేందుకు ఇప్పుడు మరో డ్రామాకు తెర తీశారన్నారు. బాబ్లీ కేసు కూడా న్యాయ ప్రక్రియలో భాగమని.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. బాబ్లీ దగ్గరకు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించి.. మహారాష్ట్ర పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని.. అది కాంగ్రెస్ హయాంలో అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు రాహుల్‌తో డ్యూయెట్లు పాడుతున్న చంద్రబాబు.. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.