భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు హైదరాబాదులో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శంషాబాద్ బస్టాప్ దగ్గర ఏర్పాటుచేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమిత్ షాకు ఘన స్వాగతం
భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు హైదరాబాదులో ఘన స్వాగతం లభించింది.
TNN 17 Sep 2016, 7:41 pm