యాప్నగరం

రాజ్యసభ బరిలో ఏడో తెలుగు వ్యక్తి.. ఎవరీ జీవీఎల్?

రాజ్యసభకు ఆరుగురు తెలుగువాళ్లు మాత్రమే ఎన్నిక అవుతుంటే.. ఏడుగురు అంటారేంటని అనుకుంటున్నారా.. నిజమే.. ఆయన వివరాలివిగో..

Samayam Telugu 11 Mar 2018, 9:59 pm
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదవీ కాలం పూర్తయిన 58 మంది రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్త వారికి అవకాశం దక్కనుంది. మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. సచిన్, రేఖ లాంటి సెలబ్రిటీలు పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు పదవీ కాలం పూర్తి కాగా.. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున బలరామ్ నాయక్‌కు ఆ పార్టీ అవకాశం కల్పించినా.. ఆయన గెలిచే అవకాశాలు స్వల్పమే. మొత్తంగా ఆరుగురు తెలుగువారు రాజ్యసభకు వెళ్లనున్నారు. వీరితోపాటు మరో తెలుగు వ్యక్తి కూడా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.
Samayam Telugu bjp picks gvl narasimha rao for rajya sabha polls
రాజ్యసభ బరిలో ఏడో తెలుగు వ్యక్తి.. ఎవరీ జీవీఎల్?


బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకి ఆ పార్టీ అవకాశం కల్పించింది. ఆయనతోపాటు అనిల్ జైన్, సరోజ్ పాండే, అనిల్ బలూనీలను రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నిర్ణయించింది.

జీవీఎల్ నరసింహారావు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు. ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో, వ్యూహరచనలో ప్రావీణ్యం ఉంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ స్ట్రాటజికల్ టీంలో పని చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.