యాప్నగరం

రాజాసింగ్‌ రాజీనామాను తిరస్కరించిన అధిష్టానం

గోరక్షణ’కోసం తాను చేస్తున్న ఉద్యమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. పార్టీకి తన వల్ల నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేశానని.. ఎమ్మేల్యే రాజాసింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 16 Sep 2018, 9:21 am
గోరక్ష' కోసం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన పదివికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం తిరస్కరించింది. ఈ మేరకు తెలంగాణలో పర్యటిస్తున్న అధినేత అమిత్‌ షా.. రాజాసింగ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. తొందరపాటు నిర్ణయాలు సరికాదని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజాసింగ్‌కు సూచించారు. రాజకీయంగా చేసే వ్యాఖ్యలు ఎవరికీ ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని అమిత్ షా అన్నారు.
Samayam Telugu రాజాసింగ్


ఆగస్టు నెలలో పార్టీకి రాజీనామా ప్రకటించిన ఎమ్యేల్యే రాజాసింగ్.. ‘గోరక్షణ’కోసం తాను చేస్తున్న ఉద్యమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. పార్టీకి తన వల్ల నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లుగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.