యాప్నగరం

‘కాపు’గాసి.. ‘కమ్మ’గా టీడీపీని నిర్వీర్యం చేయడమేనా అసలు ప్లాన్?

ఏపీలో బలపడేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ భావిస్తోంది. టీడీపీని లాగేసి ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని కమలం పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. ముందుగా కాపు నేతలను లాగేసి తర్వాత కమ్మ సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోందట.

Samayam Telugu 20 Jun 2019, 10:40 pm
లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిన మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక్క కర్ణాటకలోనే కమలం వికసించింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలుపొందిన బీజేపీ.. ఏపీలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఏపీలో బలపడటం కోసం టీడీపీకి చెందిన కీలక నేతలకు గాలం వేస్తోంది. ఆపరేషన్ కమలంతో ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతల మాటలను బట్టి చూస్తే.. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది.
Samayam Telugu bjp tdp


టీడీపీని మొత్తం ఖాళీ చేసి.. ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని తానే భర్తీ చేయాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఆ పార్టీ ఫోకస్ పెట్టిందని భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరంతా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలోని కాపు నేతలను ముందుగా పార్టీలో చేర్చుకొని... తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. టీడీపీ ఏర్పాటు నుంచి కమ్మ సామాజికవర్గం ఆ పార్టీని తమదిగా భావిస్తోంది. 2014 ఎన్నికల్లో కాపులు సైకిల్‌కి జైకొట్టారు. టీడీపీని ఇంటిపార్టీగా భావించే సామాజిక వర్గం నేతల్ని, సంఖ్యాపరంగా ఏపీలో ఎక్కువగా ఉన్న కాపు నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా బలపడాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.