యాప్నగరం

అమిత్ షా పర్యటన తర్వాత అభ్యర్థుల జాబితా

ప్రజల తీర్పును వృథా చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 9 Oct 2018, 7:37 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల అనంతరం రాజకీయ పార్టీలు తమ కసరత్తులు ముమ్మరం చేశాయి. నెల రోజుల కిందటే తమ పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి పార్టీలు పొత్తులపై చర్చించిన తర్వాత అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటన అనంతరం తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు.
Samayam Telugu Muralidhar Rao


హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని పేర్కొన్నారు.

బాధ్యతారహిత్యంగా పరిపాలించిన కేసీఆర్‌కుగానీ, కూటములతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే నైతిక అర్హత లేదన్నారు. రేపు (అక్టోబర్ 10) కరీంనగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా అమిత్ షా.. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను తెలంగాణ ప్రజలకు అమిత్ షా వివరిస్తారని మురళీధర్‌రావు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.