యాప్నగరం

అన్ని చేస్తాం, వాదించడానికి టీడీపీకి ఏం మిగలదు: కృష్ణం రాజు

విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీలపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనుందని బీజేపీ నేత కృష్ణం రాజు తెలిపారు.

Samayam Telugu 23 Jul 2018, 10:56 am
విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీలపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించనుందని బీజేపీ నేత కృష్ణం రాజు తెలిపారు. పోలవరం, దుగ్గిరాజపట్నం పోర్టులపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేయనుందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తారని రెబల్ స్టార్ తెలిపారు. జాతీయ విద్యా సంస్థల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి కేంద్రం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu krishanam raju


అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించిందని కృష్ణంరాజు తెలిపారు. మరిన్ని నిధులు కావాల్సి వస్తే.. వాటికి వనరులను కేంద్రం చూపిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఇకపై టీడీపీకి ఏ అంశం మిగలదని రెబల్ స్టార్ తెలిపారు. మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై నివేదికను సిద్ధం చేసి పార్టీ పెద్దలకు పంపుతామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.