యాప్నగరం

బోటు బోల్తా: మృతుల్లో సీపీఐ నారాయణ బంధువులు

విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించినవారికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన సంతాపాన్ని ప్రకటించారు.

TNN 13 Nov 2017, 1:44 pm
విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించినవారికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం నారాయణ ఒక వీడియో బైట్ విడుదల చేశారు. ప్రమాదంలో చనిపోయినవారిలో స్వయానా తన బావమరిది భార్య, కోడలు, మనవరాలు ఉన్నారని చెప్పారు. ఈ విషాదంలో ప్రభుత్వ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బోటు నదిలోకి వెళ్లిందంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.
Samayam Telugu boat capsized in krishna river cpi narayana closest relatives lost lives
బోటు బోల్తా: మృతుల్లో సీపీఐ నారాయణ బంధువులు


టూరిజం అభివృద్ధి పేరిట ఏపీ ముఖ్యమంత్రి సింగపూర్, మలేషియా తిరుగుతూ ప్రచార భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. ప్రజలను కూడా ఆ భ్రమలోనే ఉండేటట్లు చేశారని దుయ్యబట్టారు. ఇక్కడ టూరిజం బాగా అభివృద్ధి చెందిందన్న భ్రమలో కార్తీక మాసం సందర్భంగా పర్యాటకులు ఎంతో ఉత్సాహంతో వచ్చి ప్రమాదానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా భ్రమల్లో ఉండొద్దని, ప్రజలను భ్రమల్లోకి నెట్టొద్దని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.

కాగా, పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 45 మంది పర్యాటకులు ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. వీరిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని, 21 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారని చెప్పారు. గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందన్నారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ శాసనసభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.