యాప్నగరం

Video: కృష్ణానదిలో బోటుకు మంటలు..

విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద కృష్ణానదిలో నిలిపి ఉంచిన ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీఎం నివాసానికి సమీపంలోనే చోటుచేసుకున్న ఈ ప్రమాదం కలకలం రేపింది.

Samayam Telugu 28 Jan 2019, 10:10 pm
కృష్ణానదిలో ఓ బోటుకు మంటలు అంటుకోవడం కలకలానికి దారితీసింది. నదిలో నిలిపి ఉంచిన ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో.. బోటు నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైడింగ్‌కు అనుమతి లేకపోవడంతో బోటును తాడేపల్లి వద్ద కృష్ణానదిలో జెట్టికి కట్టి ఉంచారు. అయితే.. సోమవారం (జనవరి 28) మధ్యాహ్నం ఆ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదానికి గురైన బోటు ప్రైవేట్ సంస్థ ఛాంపియన్స్ యాచ్ క్లబ్‌కు చెందిన క్రూయిజ్ పడవగా అధికారులు గుర్తించారు. నదిలో తిరగడానికి దీనికి అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. టూరిజం శాఖ అధికారులు విచారిస్తున్నారు.

ఇది ఎవరైనా ఆకతాయిల పని అయుండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలానికి కారణమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.