యాప్నగరం

విందు వేళ బాంబు బెదిరింపు.. కేసీఆర్ సీరియస్!

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. మంగళవారం (నవంబర్ 28) రాత్రి 9.45 గంటల ప్రాంతంలో డీజీపీ క్యాంప్‌ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

TNN 29 Nov 2017, 6:54 pm
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. మంగళవారం (నవంబర్ 28) రాత్రి 9.45 గంటల ప్రాంతంలో డీజీపీ క్యాంప్‌ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్‌‌నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, అది ఏ నిమిషంలో అయినా పేలవచ్చని ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ, భాగ్యనగర విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌, సీఎం కేసీఆర్‌తో పాటు జీఈఎస్‌ ప్రతినిధులకు ప్యాలెస్‌లో పసందైన విందు ఏర్పాటు చేసిన వేళ ఇలాంటి కాల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది.
Samayam Telugu bomb threat for falaknuma palace while pm modi hosted ivanka trump for dinner
విందు వేళ బాంబు బెదిరింపు.. కేసీఆర్ సీరియస్!


బాంబ్ బెదిరింపు కాల్ నేపథ్యంలో పోలీసులు ఫలక్‌నుమా ప్యాలెస్‌ను జల్లెడ పట్టారు. విస్తృతంగా తనిఖీ చేసిన అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా గుర్తించారు. అలజడి రేగే ప్రమాదం ఉండటంతో విందు పూర్తయ్యేవరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్‌ ద్వారా ఓ దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Read this in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.