యాప్నగరం

చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. శోభాయాత్రలో ప్లకార్డులు

ఓ వినాయక మండపానికి చెందిన భక్తులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆకట్టుకున్నారు. తమ వినాయకుడిని నిమజ్జనం కోసం తరలిస్తున్న వాహనంపై ‘చైనా వస్తువులను నిషేదిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు..

TNN 5 Sep 2017, 6:08 pm
భాగ్యనగరంలో గణేశ్‌ శోభాయాత్ర కోలాహలంగా కొనసాగుతోంది. కోలాటాలు, నృత్యాలతో యువతీయువకులు సందడి చేస్తున్నారు. మరోవైపు గణనాథుణ్ని తరలిస్తున్న రథాలను ప్రత్యేకంగా అలంకరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంత మంది సమాజానికి సందేశాలిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాగే ఓ వినాయక మండపానికి చెందిన భక్తులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆకట్టుకున్నారు. తమ వినాయకుడిని నిమజ్జనం కోసం తరలిస్తున్న వాహనంపై ‘చైనా వస్తువులను నిషేదిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఇండియన్‌ ఆర్మీ జిందాబాద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు కూడా ఇచ్చి, అందరినీ ఆకర్షించారు.
Samayam Telugu boycott chinese products message in ganesh shobhayatra
చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. శోభాయాత్రలో ప్లకార్డులు


డోక్లాం సరిహద్దు వద్ద చైనా ఇటీవల భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన సంగతి తెలిసిందే. దీన్ని భారత్‌ సమర్థంగా ఎదుర్కోవడంతో డ్రాగన్‌ దేశం వెనక్కి తగ్గింది. అయినా ఆ దేశ మీడియా భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కుతూనే ఉంది. దీంతో చైనా వస్తువులు వాడొద్దంటూ సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రారంభమైంది. గణేశ్‌ నిమజ్జన వేడుకలనూ ఈ ఉద్యమానికి వేదికగా వాడుకోవడం గమనార్హం.

మరోవైపు డోక్లాం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు. బ్రిక్స్ దేశాల సమావేశం నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.