కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు బహుమతిగా ఇచ్చిన బ్రాస్లెట్ (బంగారు కంకణం)ను జగ్గారెడ్డి వేలానికి పెట్టారు. శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జగ్గారెడ్డి తన బహుమతిగా అందిన బ్రాస్ లెట్ కు వేలం నిర్వహించారు. ఈ బ్రాస్ లెట్ ను కృషి బిల్డర్స్ కు చెందిన మహేందర్ రెడ్డి రూ.20 లక్షలు చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు.
వేలం ద్వారా వచ్చిన రూ.20లక్షలను ఇటీవల ఖమ్మంలో అరెస్టయిన 11మంది మిర్చి రైతులకు, మిగిలిన రూ.9లక్షలు వరంగల్ జిల్లా రైతులకు అందజేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఇటీవల సంగారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ బహిరంగసభ ఖర్చంతా జగ్గారెడ్డి భరించారు. ఇదే విషయం వీహెచ్ రాహుల్ కు చెప్పారు. ‘అంతా జగ్గారెడ్డి ఖర్చు చేస్తే మీరేమీ ఇవ్వలేదా?’ అంటూ రాహుల్ వీహెచ్ ను అడిగారు. రాహుల్ ప్రశ్నకు.. తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని వీహెచ్ సమాధానంగా అన్నారు. అయితే వీహెచ్ చేతికున్న బ్రాస్ లెట్ ను గమనించిన రాహుల్.. దీన్ని ఇవ్వొచ్చు కదా అని సూచించారు. రాహుల్ సూచన మేరకు మీటింగ్ మరుసటి రోజు వీహెచ్ జగ్గారెడ్డికి బహుకరించారు. ఈ బ్రాస్ లెట్ ను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని రైతులకు ఇస్తానని జగ్గారెడ్డి ఆరోజే ప్రకటించి...శుక్రవారం తన మాట నిలుపుకున్నారు.
వేలం ద్వారా వచ్చిన రూ.20లక్షలను ఇటీవల ఖమ్మంలో అరెస్టయిన 11మంది మిర్చి రైతులకు, మిగిలిన రూ.9లక్షలు వరంగల్ జిల్లా రైతులకు అందజేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఇటీవల సంగారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ బహిరంగసభ ఖర్చంతా జగ్గారెడ్డి భరించారు. ఇదే విషయం వీహెచ్ రాహుల్ కు చెప్పారు. ‘అంతా జగ్గారెడ్డి ఖర్చు చేస్తే మీరేమీ ఇవ్వలేదా?’ అంటూ రాహుల్ వీహెచ్ ను అడిగారు. రాహుల్ ప్రశ్నకు.. తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని వీహెచ్ సమాధానంగా అన్నారు. అయితే వీహెచ్ చేతికున్న బ్రాస్ లెట్ ను గమనించిన రాహుల్.. దీన్ని ఇవ్వొచ్చు కదా అని సూచించారు. రాహుల్ సూచన మేరకు మీటింగ్ మరుసటి రోజు వీహెచ్ జగ్గారెడ్డికి బహుకరించారు. ఈ బ్రాస్ లెట్ ను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని రైతులకు ఇస్తానని జగ్గారెడ్డి ఆరోజే ప్రకటించి...శుక్రవారం తన మాట నిలుపుకున్నారు.