విశాఖపట్నం బుధవారం జరిగే ఓ ప్రపంచస్థాయి సదస్సుకు వేదిక అయ్యింది. ఇక్కడ మూడు రోజుల పాటూ ‘బ్రిక్స్’ సదస్సు జరగనుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షాణాఫ్రికా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. మంగళవారమే ప్రతినిధులంతా విశాఖపట్నం చేరుకున్నారు. ఏపీ సర్కార్ సదస్సుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సును కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో పట్టణ ప్రాంత ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలు, ఆకర్షణీయ నగరాలు, పారిశుద్ధ్యం, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని ఎలా నిలబడాలి లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ బ్రిక్స్ సదస్సును వెంకయ్య నాయుడు చొరవ తీసుకుని విశాఖపట్నంలో ఏర్పాటయ్యేలా చేశారు.
విశాఖపట్నంలో నేడు బ్రిక్స్ సదస్సు
విశాఖపట్నం బుధవారం జరిగే ఓ ప్రపంచస్థాయి సదస్సుకు వేదిక అయ్యింది.
TNN 14 Sep 2016, 8:00 am