ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. భారత్తో పాటూ బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు సదస్సులో పాల్గొన్నారు. మొత్తం 322 మంది ప్రతినిధులు వచ్చారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని మరీ సదస్సును విశాఖలో పెట్టించారు. సదస్సుకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అమర్ సిన్హా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్ తదితరులు హాజయ్యారు. కేంద్రమంత్రి వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సదస్సులో పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ సదస్సు మూడు రోజుల పాటూ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోసన్యాసం చేస్తున్నారు.
విశాఖలో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రపంచస్థాయి బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది.
TNN 14 Sep 2016, 3:09 pm